తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ హత్యను యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుండే పాత్రికేయులపై కక్షగట్టి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి దారుణహత్యలతో సత్యాన్ని వెలుగులోకి రానీయకుండా అపలేరని పేర్కోన్నారు.
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులనే అంతమొందించే అగంతకుల తెగువ చూస్తుంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా అన్న అనుమానాలు కలుగక మానవని వ్యాఖ్యానించారు. కాతా సత్యనారాయణపై జరిగిన దారుణ హత్య ఒక్క పాత్రికేయుడిపైన జరిగినట్టు కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో మూల స్థంభంగా నిలిచే జర్నలిజంపేనే జరిగినట్టుగా ఉందని ఆయన పేర్కోన్నారు.
భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సత్యనారాయణ ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు తెగించారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని అనుమానించక తప్పదని పేర్కొన్నారు. సత్యనారాయణపై నెల కిందటే ఒకసారి హత్యాయత్నం జరిగిందనా.. అతనికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు.
గతంలో జరిగిన హత్యాయత్న ఘటనపై పోలీసులు తగు చర్యలు తీసుకుని వుండివుంటే ఇలాంటి దారుణఘటన చోటుచేసుకుని వుండేది కాదన్నారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన ఇవాళ రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా విలేకరి హత్య వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని అందించాలని కోరారు. విలేకరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Killing of journalist a barbaric act- JanaSena Chief @PawanKalyan pic.twitter.com/lNncnsKrKk
— JanaSena Party (@JanaSenaParty) October 15, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more