తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో ఈ నెల 10 నుంచి రెండేళ్ల పాటు మద్యం దుకాణాలకు నిర్వహణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తొలిరోజునే మద్యం వ్యాపారుల నుంచి అమిత స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2 లక్షల వెనక్కు తిరిగి ఇవ్వబడని డిపాజిట్ తో దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా, తొలి రోజున 233 దరఖాస్తులు వచ్చాయి.
ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల ధరఖాస్తులను సైతం ప్రభుత్వం రెట్టింపు చేసింది. అయినా మద్యం వ్యాపారులు పోటీ పడి మరీ ధరఖాస్తులను తీసుకుంటున్నారు. 2017కు ముందు ఒక్క ధరఖాస్తును రూ.50 వేలు వుండగా, 2017లో దీనిని రూ.లక్షకు పెంచిందీ ప్రభుత్వం. కాగా తాజాగా నూతన మద్యం పాలసీలో భాగంగా ఒక్కో దరఖాస్తును రూ. లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మందుబాబులకు డోకా లేకపోవడంతో.. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు నెలకొన్న పోటీలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ధరఖాస్తుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కొత్త మద్యం దుకాణాల నిర్వహణ దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 16 బుధవారం వరకు సమయం ఉన్నప్పటికీ, విజయదశమి తరువాతి రోజున ఏకాదశి కావడంతో వ్యాపారులు తమ టెండర్లను వేశారు. విజయ ఏకాదశి రోజున టెండర్ల వేస్తే తమకే దుకాణం లక్కీ లాటరీలో వస్తుందన్న సెంటిమెంటుతో మద్యం దుకాణాదారులు టెండర్లు వేసేందుకు పోటీ పడ్డారు. దీంతో తొలిరోజునే ఏకంగా 233 టెండర్లు ను రాష్ట్ర వ్యాప్తంగా వున్న మద్యం వాప్యారులు సమర్పించారు.
తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కు వచ్చిన ఆయన, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిటైల్ వైన్ షాప్ ల దరఖాస్తులను స్వీకరిస్తున్న ఏర్పాట్లపై ఆయన చర్చలు జరిపారు. మొత్తం 33 జిల్లాల్లో 34 దరఖాస్తు స్వీకరణ ఏర్పాట్లు చేశామని, మొత్తం విధానాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more