Rickshaw puller wins Rs 50 lakhs in lottery వరుణుడి కటాక్షంలో లక్షాధికారిగా రిక్షావాలా..!

Rickshaw puller from bengal wins rs 50 lakhs in nagaland lottery

Rickshaw puller wins Nagaland Lottery, Nagaland Lottery, Rickshaw lottery, Rickshaw puller Nagaland Lottery, Gaur Das, West Bengal, rickshaw puller, Dimapur, Rs 50 lakhs, Prize money, Nagaland’s State Lottery, Lottery

Gaur Das, a native of West Bengal earning his living by pulling a rickshaw in Dimapur, has become an overnight star by winning Rs 50 lakhs in Nagaland’s State Lottery

వరుణుడి కటాక్షంలో లక్షాధికారిగా రిక్షావాలా..!

Posted: 10/02/2019 05:56 PM IST
Rickshaw puller from bengal wins rs 50 lakhs in nagaland lottery

అదృష్టం అన్నది నుదుటన రాసి వుంటే అది ఆకాశంలో వున్నా.. లేక పాతాళంలో వున్నా సమయం వచ్చినప్పుడు తప్పక వరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మొన్నా మధ్య ఓనమ్ పండుగ రోజు జ్యూవలరీ దుకాణంలో పనిచేసే ఆరుగురు మిత్రులు కలసి లాటరీ టికెట్ కొంటే వారికి ఏకంగా ప్రథమ బహుమతిగా ఏకంగా రెండు కోట్ల రూపాయల లాటరీ డబ్బు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు.

అయితే అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేమన్నది వాస్తవం! ఈ రిక్షావాలా విషయంలో అది నిజం అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గౌర్ దాస్ వర్షం కారణంగా లాటరీలో రూ.50 లక్షలు గెలుచుకోవడం అదృష్టం కాక మరేంటి? గౌర్ దాస్ నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబరు నెలాఖరులో ఇతర రిక్షావాలాలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, విహారయాత్రకు వెళ్లే రోజున భారీ వర్షం కురిసింది. దాంతో ఆ యాత్ర క్యాన్సిల్ అయింది. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా, లాటరీలు అమ్మే ఓ వ్యక్తి ఎదురొచ్చి లాటరీ కొనాలంటూ వెంటపడ్డాడు. లాటరీ విలువ రూ.30 మాత్రమే కావడంతో, సరేనని చెప్పి ఓ లాటరీ కొనుగోలు చేశాడు గౌర్ దాస్. అయితే దానిపైనా అంత నమ్మకం పెట్టుకోని గౌర్ దాస్ టికెట్ ను ఇంట్లోనూ పెట్టేశాడు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత తొటి రిక్షా కార్మికులు లాటరీ ఫలితాలు వచ్చయని అంటుంటే విన్నాడు గౌర్ దాస్.

దీంతో వారం క్రితం వచ్చిన లాటరీ ఫలితాలను రెండు రోజుల ఆలస్యంగా చూసుకున్నాడు. ఫలితాలను చూడగానే ఆతడి గుండె అగినంత పనైంది. ఎందుకంటే తాను కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆ రిక్షావాలా ఆనందం అంతాఇంతా కాదు. అయితే, తన ఆనందాన్నంతా తన హృదయంలోనే దాచుకున్న గౌర్ దాస్.. తొలుత లాటరీ డబ్బు వచ్చే మార్గం ఎలా అన్ని విషయాన్ని తెలుసుకుని తదనంతర పనులను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా పూర్తి చేశాడు.

ఎవరికన్నా తెలిస్తే, ప్రమాదం అని భావించిన ఆయన ఈ ఆనందాన్ని కేవలం తన భార్యతో మాత్రమే పంచుకున్నాడు. ఇక లాటరీలో వచ్చిన డబ్బును ఆధారాలతో పాటుగా తన బ్యాంకు అకౌంట్లో జమ చేసిన గౌర్ దాస్ అప్పుడు తాపీగా ఊపీరిపీల్చుకున్నాడు. తన వద్ద అంత డబ్బు వుందని తెలిస్తే ప్రమాదమని బావించిన అతను ఇలా చేశాడు. తాను ఓ మంచి ఇల్లు కొనుకున్ని తన కష్టాల నుంచి గట్టెక్కిన తరువాత ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోవాలని భావించాడు.

అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందన్న చందాన.. రిక్షావాలాకు లాటరీలో యాభై లక్షల రూపాయలు వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా.. ఈ విషయాన్ని మొత్తంగా తెలిసెలా చేసింది. అయితే మొత్తం డబ్బును తాను వాడుకోనని అందులో సుమారు ఐదు లక్షల రూపాయలను నలుగురికి సాయం చేసేందుకు వెచ్చిస్తానని కూడా గౌర్ దాస్ మీడియాతో చెప్పాడు. ఇలా వరుణుడి కటాక్షంతో ఓ రిక్షావాలాను ధనవంతుడయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles