ప్రపంచ దేశాలను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేశారు. ఆయిల్ ధరలు రెక్కలోస్తాయని హెచ్చరించిన ఆయన.. ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందన్నారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం సంచలనంగా మారింది. సౌదీ ప్రభుత్వానికి చెందిన రెండు అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పై సెప్టెంబర్ 14న జరిగిన డ్రోన్ దాడికి ఇరాన్ కారణమని బిన్ సల్మాన్ ఆరోపించారు.
ఈ దాడి కారణంగానే ఆయిల్ ఉత్పత్తి సగానికి తగ్గిందని, చమురు ధరలు పెరిగాయని అన్నారు. ఇరాన్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు.. బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రపంచ ప్రయోజనాలను బెదిరించే మరిన్ని తీవ్రతలను చూస్తామని సౌదీ రాజు సల్మాన్ పేర్కోనడం అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ మేరకు ఆయన క్రితం రోజున సిబిఎస్ టీవీ ప్రోగ్రాం... 60 మినిట్స్ లో తన ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఇరాన్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే చమురు సరఫరా అంతరాయం కలగడం తప్పదని ఆయన సూచనలు చేశారు. చమురు ధరలు మన జీవితకాలంలో చూడని విధంగా ఆకాశాన్ని తాకుతాయని హెచ్చరించారు సౌదీ రాజు. అయితే ఇరాన్ తో తాను సైనిక చర్య కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసిన ఆయన... ఇరాన్ తో రాజకీయ పరిష్కారాన్ని ఇష్టపడతానని సల్మాన్ వెల్లడించటం విశేషం. సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
అయితే సౌదీ రాజు సల్మాన్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయలేదని అంటోంది. సౌదీ - ఇరాన్ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా.. పెట్రోల్ రేట్లు ఊహించని విధంగా పెరుగుతాయని చెప్పటం ప్రపంచదేశాలను భయపెడుతోంది. పెట్రోల్ రేట్లు ఇదే విధంగా పెరిగితే ఆ రాజు చెప్పినట్లు లీటర్ పెట్రోల్ 150 రూపాయలు అవుతుందా ఏంటీ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more