సినీ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ అరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ కు చెన్నై అపోలో ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మృతిచెందారన్న వార్తలు పలు వైబ్ సైట్లలో రావడంతో కుటుంబసభ్యులుతు తో పాటు చైన్నై అపోలో అసుపత్రి వర్గాలు కూడా స్పందించాయి.
శివప్రసాద్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అసుపత్రి యాజమాన్యం తెలిపింది. శివప్రసాద్ కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. అయితే బతికివున్న ఆనయన మరణించారని వెబ్ సైట్లతో పాటు పలు మీడియా సంస్థలు కూడా వార్తలును ప్రచురిండంపై బాధాకరమని అన్నారు.
శివప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన అరోగ్యపరిస్తితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి కూడా చంద్రబాబు అరా తీశారు. శివప్రసాద్ త్వరలోనే కొలుకుంటారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే రెండు రోజులుగా శివప్రసాద్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు అందగా, ఇవాళ మధ్యామ్నం మరింతగా విషమించిందని తెలుస్తోంది.
గత వారం రోజులుగా అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్లో చికిత్సపొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొద్దిరోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.
విభజన, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలిపి తమ సమస్యలను పాలక ప్రభుత్వాలకు తెలిపడంతో పాటు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షంచాడు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు.
శివప్రసాద్ కు చిన్నప్పటి నుంచి నాటకాలు చూడటం కన్న వాటిలో నటించాలంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన చిన్ననాటి నుంచి నాటకాలు వేస్తూ స్వతహాగా రంగస్థల నటుడిగా రాణించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో తనదైన విక్షలణ నటనను ప్రదర్శించారు. పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more