ఆంధ్రప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మనుషుల రక్తాన్ని తాగే జలగల్లా తయారై అక్కడి ఫైనాన్షియర్లు.. తమకు రావాల్సిన వ్యక్తి దహనసంస్కారాలను కూడా అడ్డకుని బాకీని చెల్లించే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని భీష్మించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం నివ్వెరపోయేలా చేసే ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.
చనిపోయిన ఓ వ్యక్తి... "బాకీ తీర్చలేదు" అంటూ అతని మృతదేహానికి రెండు రోజులుగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు అప్పుల వాళ్ళు. మృతుని భార్య పిల్లలు ఎంత ప్రాధేయ పడ్డా కనికరం చూపలేదు. పైగా చనిపోయిన బాధితుణ్ని వెలివేస్తున్నట్టుగా చింతచెట్టుకి చెప్పును వేలాడదీసి దానిపైన మృతుని పేరు రాసి ఆటవిక న్యాయాన్ని అమలు చేశారు. నాగరికత కొత్త పుంతలు తోక్కుతున్న ఈ రోజుల్లో ఇంకా అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే అప్పు తీసుకున్న వ్యక్తికి పూచికత్తుగా వుండటంతో.. ఆ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని అమానవీయంగా వ్యవహరించారు ఫైనాషియర్లు. అప్పు తీసుకున్న వ్యక్తి వున్నా అతని వద్దనుంచి డబ్బులు వసూలు చేయడం మాని.. పూచీకత్తు వున్న వ్యక్తి మరిణిస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. పుంగనూరులోని మోండోలు సామాజిక వర్గానికి చెందిన శివకుమార్... అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర అప్పుచేశాడు.
దీనికి అతని భార్య తండ్రి వెంకటరమణ హామీ ఇచ్చాడని అప్పుల వాళ్లు చెబుతున్నారు. అయితే అనారోగ్యంతో వెంకటరమణ రెండురోజుల కిందట చనిపోయాడు. ఐతే అతని అల్లుడు శివకుమార్ తమ దగ్గర తీసుకున్న లక్షల రూపాయల అప్పు తీర్చకుండా శవానికి అంత్యక్రియలు జరిపితే కుదరదన్నారు అప్పులవాళ్ళు. తమ కుల సంప్రదాయం ప్రకారం ఒక చెప్పుకు మృతుని పేరు రాసి దాన్ని చింతచెట్టుకు వేలాడదీశారు. వెంకటరమణను కడసారి చూసేందుకు వెళ్ళే బంధువులను అడ్డుకునేందుకు యత్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more