గోదావరిలో నదిలో దేవిపట్నం మండలపరిధిలోని కచ్చలూరు వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరుగుగా ఇంకా పలువురి అచూకీ లభ్యకాలేదు. దీంతో గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరింది. ఇవాళ కూడా అధికారులు పలు మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘటనలో మొత్తంగా 39 మంది వరకు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చినా.. అది నిజం కాదని బోటులో వున్నవారి సంఖ్య 93 అని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హర్షకుమార్ అరోపించారు. ఈ మేరకు ఆయన బోటు ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బోటును నడపడానికి ఉన్నత వర్గాల ఒత్తిడే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 93 మంది ఉన్నారని ఆయన చెప్పారు.
దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించి బోటును వెనక్కు తీసుకెళ్లాలని కోరినా.. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం నాడే బోటు జాడ తెలిసిందన్నారు. కానీ, దాన్ని బయటకు తీస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయని బయటకు తీయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రమాదం జరిగిన బోటులో కూడ ఇలానే జరిగి ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా మునిగిన బోటును వెలికి తీసే అవకాశం ఉందన్నారు. అధికారులు ఈ బోటును తీసేందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదం విషయంలో అధికారులు సీఎం జగన్ కు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
మృతుల కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. ఈ ప్రమాదంపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాగా హర్షకుమార్ అరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటరిచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బోటుకు అనుమతి ఇచ్చేందుకు ఒత్తిడి చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తనపై తప్పుడు అరోపణలు చేస్తున్న హర్షకుమార్ పై పరువు నష్టం దావా వేస్తానని మంత్రి అవంతి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more