వైఎస్సార్సీపీ పాలనపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యింది జనసేన. ఈ నెల 14న అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా.. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఈ నివేదికను ప్రజల ముందు ఉంచబోతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడువు ముగియడంతో నివేదిక ఇచ్చేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటనను ట్వీట్ చేసింది.
ఈ నెల 14న ఉదయం.. 11 గంటలకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ 100 రోజుల పాలనపై నివేదికను ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. ఈ వంద రోజుల్లో వైఎస్సార్సీ ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పని తీరును అధ్యయనం చేయడానికి పార్టీలోని నేతలు, నిపుణులతో పది బృందాలను పవన్ కళ్యాణ్ నియమించారు. వీరు తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికలను అధినేతకు అందజేశారట.
నేతలు సమర్పించిన నివేదికల్లోని ముఖ్యాంశాలను క్రోడీకరించి అమరావతిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో.. నివేదికను ప్రజలకు తెలియచేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, వివిధ వర్గాల వారిని కలుసుకుంటారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. జనసేనాని తన నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తిగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more