ఆనంత చతుర్ధశి రోజున వినాయక ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడం.. పదకొండు రోజుల పాటు మహాగణపతితో పూజలందుకున్న గణనాధులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇప్పటికే బాలాపూర్ నుంచి గణనాధుల శోభాయాత్రం (ఊరేగింపు) ప్రారంభమై క్రమంగా ట్యాంక్ బండ్ వైపుకు కాగా, నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఇవాళ ముందుగా ఖైరతాబాద్ గణనాధుడ్ని గంగమ్మ ఓడికి చేరుకున్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఖైరతాబాద్ గణనాధుడి నిమజ్జనాన్ని పూర్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విశిష్టమైన ఖైరతాబాద్ మహా గణపతి.. భక్త జనాల హర్షధ్వానాల మధ్య గంగమ్మ ఒడి చేరాడు. నెక్లెస్ రోడ్డులోని క్రేన్ నంబర్ 6 ద్వారా బడా గణేష్ను అధికారులు జలప్రవేశం చేయించారు. ట్యాంక్ బండ్ పైనుంచి వేలాది మంది భక్తులు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. గురువారం మధ్యాహ్నం బడా గణేష్ నిమజ్జనం పూర్తైంది. ఈ ఏడాది ఖైరతాబాద్లో ద్వాదశ ముఖ లంబోదరుడిని ఏర్పాటు చేశారు.
అశేష భక్తజన కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణేషుడి యాత్ర సుమారు 7 గంటల పాటు సాగింది. వివిధ కళారూపాలు, పోతురాజుల విన్యాసంతో గణేషుడి యాత్ర ఆద్యంతం కోలాహలంగా సాగింది. గురువారం ఉదయం ప్రారంభమైన గణనాథుడి శోభయాత్రతో భాగ్యనగర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నెక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ వద్దకు చేరుకున్న గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామి వారి కలశాన్ని ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం చేశారు.
అనంతరం దాదాపు 50 టన్నుల బరువున్న భారీ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేశారు. గణపతిబొప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. గతేడాది నుంచి అధికారులు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని మొదట పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శోభాయాత్రలో తరలివచ్చే వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి శోభాయాత్రలో 10 వేల లారీలు పాల్గొంటాయని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more