ఆనంత చతుర్ధశి రోజున వినాయక ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడం.. పదకొండు రోజుల పాటు మహాగణపతితో పూజలందుకున్న వినాయకుడి ప్రీతికరమైన ప్రసాదంగా ప్రసిద్ది చెందిన లడ్డూకు భలే గిరాకీ ఏర్పడుతుంది. ఇక హైదరాబాద్ అనగానే బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టమైనదిగా ప్రసిద్ది చెందింది. గణేశ్ భక్తులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు దక్కించుకున్నారు.
గత సంవత్సరం లడ్డూ ధర రూ. 16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం లడ్డూ ధర దాన్ని మించింది. రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇక నగరంలోని భోలక్పూర్ డివిజన్లో వినాయకుడి బంగారు లడ్డూ ప్రసాదానికి ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఇది తక్కువ ధరే అయినప్పటికీ దక్కించుకునేందుకు మాత్రం భక్తులు పోటీపడ్డారు.
శ్రీ సిద్ధి వినాయక భగత్సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రసాదంగా సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను కూడా పెడుతూ వస్తున్నారు. ఈసారి రూ.5 లక్షల విలువైన 123 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేసి ఉంచారు. నిన్న ఈ లడ్డూకు వేలం పాట నిర్వహించగా దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. చివరికి స్థానిక చేపల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ రూ.7.56 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది 120 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేయగా స్థానికంగా నివసించే కె.భాస్కర్ అనే వ్యక్తి రూ.8.1 లక్షలకు దక్కించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more