సాధారణంగా మనుషులు, జంతువులు, వాహనాలు, వస్తువులకు ఇన్సూరెన్స్ చేయిస్తారు. కానీ అక్కడ విగ్రహానికి కూడా ఇన్సూరెన్స్ చేయించారు. ముంబై మాతంగ ప్రాంతంలో కొలువుదీరిన అత్యంత ఖరీదైన గోల్డెన్ కింగ్ గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండల్లలో గురు గణేష్ సేవా మండలం లేదా జిఎస్ బీ మండలం ఒకటి. జీఎస్బీ సేవా మండల్ 1954లో స్థాపించిన ఈ గణపతిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గోల్డెన్ కింగ్ గణేష్కు 266 కోట్ల 65 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ ఏడాది కింగ్ సర్కిల్లోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్బీ) సేవా మండలం రూ .266.65 కోట్ల బీమా కవర్ తీసుకుంది.
డిఎన్ఎలో ప్రచురించిన కథనం ప్రకారం.. 2017, 2018 సంవత్సరాల్లో మండలానికి వరుసగా రూ .264.25 కోట్లు, 265 కోట్లు బీమా చేశారు గౌడ్ సరస్వతి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు. ఇక ఈ సమితి కేవలం దేవుడి ఆబరాణాలకే కాకుండా.. తమ గణనాధుడి వీక్షించేందుకు వచ్చే భక్తులను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. తమ భక్తులకు మొత్తంగా రూ.20 కోట్లు రూపాయల మేర భీమాను కూడా చేయించింది. ఉగ్రవాదులు లేదా అల్లర్లతో సహా అన్ని రకాల దాడులను బీమా కవర్ చేస్తుందని ఈ మండల్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు మరియు తేయాకు సమర్పిస్తుంటారు. వీటిని భక్తులకు పంపిణీ చేస్తుంటారు.
వీటితో పాటు రెండు వేల రెండు వందల మంది కార్మికులు, వాలంటీర్లు కూడా ఈ గణనాధుడి వద్ద సేవలు అందిస్తుంటారు. వీరందరికీ వ్యక్తిగత ప్రమాద కవర్ రూ .224.90 కోట్లు, ఇది మొత్తం బీమా డబ్బులో అతిపెద్ద భాగం. మండలం ప్రతి రోజు రూ .53.33 కోట్ల బీమాను పొందిందని డీఎన్ఏ నివేదిక తెలిపింది. మార్క్యూలో సిసిటివి కెమెరాలు, ఫర్నిచర్, ఫిక్చర్స్, కంప్యూటర్లు ఉన్నాయి. ఇవి అగ్ని, ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు, సమ్మె, నష్టాలు, భూకంపాలు వంటి ప్రమాదాలను కవర్ చేస్తాయి. బీమా గణేష్ చతుర్థి రోజున ప్రారంభమవుతుంది. విగ్రహ నిమజ్జనం, ఆభరణాలు సురక్షితంగా భద్ర పరిచాక తర్వాత మాత్రమే బీమా ముగుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more