ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేనాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో ఉన్న రైతులను ఆయన కలవనున్నారు. అమరావతిలో నిలిచిపోయిన రాజధాని పనులను పరిశీలించనున్నారు. రాష్ట్ర రాజధాని తరలింపుపై వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విస్మయానికి గురైన రైతులు ఆయనతో భేటీ అయిన తరువాత ఆయన తాను అమరావతిలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని, అక్కడి రైతులను కలుస్తానని ఆయన వారికి చెప్పారు. అమరావతిలో పనులు ఎంతవరకు చేరకున్నాయి.. రాజధాని నిర్మాణం పనులు ఎందుకని నిలిచిపోయాయి అన్న విషయాలను వారితో కలసి చర్చించి తెలుసుకుంటానని అన్నారు. తమకు ఇవ్వాల్సిన కౌలు డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఈ సందర్భంగా పవన్ కు తెలిపారు. రాజధానిని మార్చబోతున్నారనే వార్తలతో తాము ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. తమ సమస్యలపై పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో రాజధాని మారుతూపోతే.. రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తికాదని అన్నారు. ఇక రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే 29 గ్రామాలు ఎప్పటికీ ముంపు గ్రామాలు కావని కూడా వారు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వేసిన కమిటీ సభ్యులే వచ్చి పరిశీలించి రాజధాని నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇక మూడు టీఎంసీల నీరు వచ్చినా వాటిని నదిలోకి తోడేందుకు రిజర్వాయర్లు వున్నాయని కూడా తెలిపారు. రైతుల అవేదనను విన్న పవన్ కల్యాన్.. తాను ఈ నెల 30, 31న అమరావతిలో పర్యటించి పరిశీలిస్తానని వారికి భరోసా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more