కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.
Sorry to hear about the demise of #ArunJaitley ji, an articulate, intellect and affable leader. In his 4-decade long political career, he made notable contributions in the service of nation and stood up for values. My prayers are with his family and friends in this hour of grief.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2019
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా జైట్లీ అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు తెలిపారు. ఆయన కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో అందరికీ దూరం కావడం నిజంగా దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అరుణ్ జైట్లీ పరమపదించడం చాలా బాధ కలిగించిందంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఆయన న్యాయవాదిగానే కాకుండా, ఆర్థికమంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిన వైనం ఆయన స్థైర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more