మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదైన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. పోలీసులు ప్రజాప్రతినిధికి ఇచ్చే మర్యాద ఇదేనా.. అంటూ ప్రశ్నించారు.
అదే సమయంలో ఎమ్మెల్యేలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కేసులు పెడతామని, వారిపై కూడా వెనువెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు వ్యవహరిస్తే మంచిదేనని.. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మలికిపురం ఘటనలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు.
ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 11 | ఇండియన్ శాటిలైట్ రీసర్చ్ సెంటర్ (ఇస్రో) అంతరిక్ష రేసులో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ప్రయోగించిన సీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.... Read more
Dec 11 | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి బైక్ నెంబర్ ప్లేట్ ను ఫోటోలు తీస్తూ.. అదునాథన రీతిలో వారికి ట్రాఫిక్ చాలానాలు పంపుతున్న క్రమంలో.. బైక్ యజమానులు కూడా... Read more
Dec 11 | రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12న దీక్షకు సన్నధమవుతున్నారు. రైతులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యల విషయంలో గొంతెత్తి అరిచినా... Read more
Dec 11 | అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. న్యూజెర్సీలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలోని హడ్ సన్ కౌంటీ నగరవాసులందరినీ భయాందోళనకు గురిచేసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు... Read more
Dec 11 | టీడీపీ పార్టీ అగ్రనేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా.? వర్షాకాలం ముగిసిన తరువాత కురిసిన అకాలవర్షాలకు కృష్ణ నది పరివాహిక ప్రాంతంలోని ఇళ్లు, పోలాలు నీట మునగిన సమయంలో ప్రభుత్వ అదేశాల మేరకు కొందరు నీటిపారుదల... Read more