Former Minister Mukesh Goud passes away మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత..

Former andhra minister mukesh goud passes away

Mukesh Goud, Mukesh Goud No More, Mukesh Goud Passes away, Mukesh Goud dead, Mukesh Goud died, Congress, Andhra Pradesh Assembly, former minister, Telangana, YS RajaShekar Reddy, Andhra Pradesh Assembly, Telangana news, Telangana

Senior Congress leader and former minister Mukesh Goud passes away today afternoon in apollo hospital, after suffering from throat cancer since few days,

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇక లేరు..

Posted: 07/29/2019 03:44 PM IST
Former andhra minister mukesh goud passes away

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పరమపదించారు. ఆయన వయస్సు 60 ఏళ్లు. 1959 జులై 1న ఆయన జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిగా సేవలు అందించారు. వర్గరాజకీయాలకు ఆమడదూరంగా వుండే ఆయనను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పర్యాయాలు మంత్రిపదవినిచ్చారు.

ఆ తరువాత ఆయన రోశయ్య హయంతో పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కు ఆయన సమీప బంధువు . కార్పోరేటర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన రెండు పర్యాయాలు మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి మరో పర్యాయం గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా వుందని వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోలేదు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ముఖేశ్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

విద్యార్థి దశ నుంచే ఆయన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. తొలుత ఎన్ఎస్‌యూఐలో పనిచేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించారు. 1986లో జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి బీసీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009లో మార్కెటింగ్ శాఖ బాధ్యతలు చేపట్టి పూర్తికాలం పనిచేశారు. 2014, 2018లలో అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Goud  passes away  Congress  Andhra Pradesh Assembly  former minister  Telangana  

Other Articles