మిస్ ఇండియా వరల్డ్ 2019 పోటీల్లో సౌందర్య కిరీటం రాజస్థాన్ యువతి వశమైంది. ముంబైలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అందాల పోటీల్లో సీఏ చదువుతున్న సుమన్ రావు మిస్ ఇండియా-2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అపురూపమైన విజయం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పట్టుదల ఉంటే ఎటువంటి పరిస్థిత్తుల్లోను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే విజయం దక్కించుకోవచ్చన్నారు.
ఈ ఆత్మవిశ్వాసంతోనే డిసెంబర్లో బ్యాంకాక్ లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొంటానని తెలిపారు. తనను వరించిన కిరీటంతో పాటు మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా తన వద్దే అట్టిపెట్టుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపింది. ఈ పోటీల్లో మిస్ గ్రాండ్ ఇండియాగా ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ నిలవగా.. బిహార్ రాష్ట్రానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్ధిని శ్రేయా శంకర్ విస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 టైటిల్ ను గెలుచుకున్నారు.
కాగా, తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్గా నిలిచారు. సంజనా విజ్ యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్ చదువుతోంది. మిస్ ఇండియా 2019ను ఎంపిక చేసే ప్యానెల్ కమిటీలో.. ప్రముఖ డిజైనర్ ఫాల్గునీ షేన్ పికాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియాన్, నటులు హ్యూమా ఖురేషీ, చిత్రంగదా సింగ్, అయుష్ శర్మ, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, క్రీడాకారులు డుటీ చంద్, టీమిండియా ఫుల్ బాల్ కెప్టెన్ సునీల్ ఛట్రీ తదితరులు పాల్గోన్నారు. ఇదిలావుండగా, న్యాయమూర్తులు శరీరవర్ణాన్ని మార్కులు వేశారన్న విమర్శలు కూడా వినిపించడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more