ఆంధ్రప్రదేశ్ నూతన పోలీస్ బాస్ (డీజీపీ)గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో బాధ్యతలు స్వీకరించిన ఐదో అధికారి ఆయన. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన గౌతం సవాంగ్ తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సవాంగ్ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందని, దానిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు.
ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అటువంటి శాఖకు డీజీపీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా డీజీపీకి పలు సూచనలు చేశారు. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం తరుపున పోలీసులు పనిచేయాలని అందుకు తగ్గట్లుగా పోలీసులు వ్యవహరించాలని ఆయన అన్నారు. సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, శాంతిభధ్రతల విషయంలో కాంప్రమైజ్ కాకూడదని సీఎం ఇప్పటికే తనకు చెప్పినట్లు సవాంగ్ తెలిపారు.
ఈ విషయంలో మీడియా, ప్రజలు సాకారం తనకు ఉండాలని కోరిన ఆయన అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన కాల్ మనీ కేసులో అసలు జరిగిందేమిటీ.? ఈ కేసులో అసలు నిందితులు ఎవరన్న విషయం కూడా దర్యాప్తులో తేలిపోతుందని అన్నారు. అయితే ఈ కేసులో చాలా లిటిగేషన్స్ వున్నాయన్న ఆయన.. ఎన్ని అవరోధాలు వున్నా వాటిన్నింటినీ చేధించి ప్రజలకు, బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more