నర్మదా నది తీరంలో భారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరువాత, మరో భారీ విగ్రహం తయారవుతోంది. రాజస్థాన్ లోని గణేశ్ టేక్రీ సమీపంలోని నాథ్ ద్వారా వద్ద పరమశివుని అత్యంత భారీ విగ్రహం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆవిష్కరణ తరువాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం కానుంది. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని విగ్రహ ఏర్పాటు కమిటీ చెబుతోంది. విగ్రహ నిర్మాణానికి మొత్తం 2,500 టన్నుల ఉక్కును వాడుతుండగా, దీని ఎత్తు 351 అడుగులు ఉంటుంది.
ఈ విగ్రహాన్ని చూసేందుకు మూడు వ్యూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వాటిలో మొదటిది 20 అడుగల ఎత్తులో, 110 అడుగుల ఎత్తులో, 270 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడికి చేరుకునేందుకు లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ నిర్మణం మిరాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, ఉక్కుతో పాటు హై క్వాలిటీ కాపర్, జింక్ లను కూడా వాడుతున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అన్ని విగ్రహాల్లో నాలుగో అతిపెద్దదని, కాగా దేశంలోనే తొలి అతిపెద్ద శివవిగ్రహంగా ఇది కీర్తికెక్కనుంది.
2013 ఏప్రిల్ 17న విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించామని మిరాజ్ గ్రూప్ పేర్కొంది. ట్విట్టర్ లో సంస్థ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే, విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. శివుని తలకు పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం విగ్రహం మెడ నుంచి కింది భాగం వరకూ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ విగ్రహం ముందు కొలువుదీరనున్న భారీ నంది 37 అడుగుల పొడవుతో, 25 అడుగుల ఎత్తుతో ఉండనుంది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం అంతా సవ్యంగా జరిగివుంటూ ఇప్పటికే ఈ విగ్రహం అవిష్కరణకు నోచుకునేది. కానీ అత్యంత భారీ విగ్రహం కాబట్టి కొంత పనులు అలస్యమైయ్యాయని.. అయితే భక్తులకు చూడచక్కగా విగ్రహాన్ని రూపోందించడంలో ఎక్కడా రాజీ పడటం లేదని మిరాజ్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more