ఆంధ్ర ఆక్టోపస్గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్న ఐదేళ్ల తరువాత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సర్వేలు చేయబోనని.. సర్వేల నుంచి కూడా తాను సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వరుసగా రెండు సార్లు తన సర్వేలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజానాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలం అయినందుకు గాను ఇకముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను.’ అని ఆ ప్రకటలో పేర్కొన్నారు.
ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలు.. అసలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. దీంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే క్రేజ్ ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారు అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే, ఆఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 117 సీట్లకు గాను 88 స్థానాల్లో విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని లగడపాటి చెప్పారు. టీడీపీకి 100కు పైగా సీట్లు వస్తాయని, వైసీపీకి 69 వరకు సీట్లు రావొచ్చని అంచనా వేశారు. కానీ, వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 175కు గాను 151 సీట్లు సాధించింది. అధికార టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. జనసేన ఒక్క సీటు సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెడతారంటూ లగడపాటి చెప్పిన విషయం కూడా ఫెయిలైంది. వరుసగా ఆయన సర్వేలు విఫలం కావడంతో లగడపాటి రాజగోపాల్ పరువు పోయింది. దీంతో ఇకపై తాను సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన సర్వేల వలన ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించగలరని లగడపాటి కోరారు.
#LagadapatiSurvey
— News18 Telugu (@News18Telugu) May 24, 2019
లగడపాటి రాజగోపాల్ సర్వే సన్యాసం.. సంచలన ప్రకటన #LagadapatiRajGopal #Politics #News18Telugu pic.twitter.com/xIypZtFASN
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more