గుజరాత్లోని సూరత్లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్థుల భవనం ఐదో అంతస్థులో వున్న కోచింగ్ సెంటర్ ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్ర రూపం దాల్చాడంతో 20 మంది విద్యార్థులు మృతిచెందినట్టు సమాచారం. ప్రాణాల్ని కాపాడుకొనే క్రమంలో పలువురు విద్యార్థులు భవనంపైనుంచి కిందకు దూకేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
గుజరాత్ లోని సూరత్ పట్టణంలోగల సర్తానా ప్రాంతంలో తక్షశిల కమర్షియల్ కాంప్లెక్స్ అనే బహుళ అంతస్థు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని ఐదవ అంతస్థులో వున్న ఓ కోచింగ్ సెంటర్ అలోహా తరగతులను నిర్వహిస్తోంది. ఈ తరగతులకు విద్యార్థులు హాజరైన క్రమంలో అదే కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి ఒక్కఉదుటన వ్యాపించడంతో దట్టమైన పోగ అలుముకుంది. దీంతో విద్యార్థులు తప్పించుకునేందుకు మార్గం లేకపోవడంతో తరగతుల నుంచి బయటకు వచ్చి కిందకు దూకేశారు.
మరికోందరు విద్యార్థులు బయటకు వచ్చే మార్గం లేక దట్టమైన పోగలో చిక్కకుని ప్రాణాలను కొల్పోయారు. కిందకు దూకడంతో విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాగా, ఇంత పెద్ద ప్రమాదం కళ్లముందు జరుగుతున్నా.. స్థానికులు కొందరు సహాయ చర్యలు చేపట్టగా అక్కడ గుమ్మిగూడిన అనేక మంది మాత్రం విద్యార్థులు భవనంపై నుంచి దూకే దృష్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు.
ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సూరత్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘సూరత్లో జరిగిన భయానక అగ్ని ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులను సత్వరమే ఆదుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను కోరా’ అని మోదీ తన ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం విజయ్రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more