తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రసె్ శ్రేణుల్లో ఈ ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ను తీసుకువచ్చాయి. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా.. ఘోర వైఫల్యాన్ని చవిచూసిన కాంగ్రెస్.. లోక్ సభ ఫలితాలలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను రాబట్టాయి. ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుపోందడంతో అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో చెల్లని రూపాయి.. లోక్ సభ ఎన్నికలలో ఎలా చెల్లుతుందని అంటూ ప్రచారం చేసినా.. తాజాగా వెలువడిన ఫలితాలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు కొత్త జోష్ నింపారు.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో వెలువడిన తొలిఫలితం భువనగిరి లోక్ సభ నియోజకవర్గానిదే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పై ఆయన విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ కి బలమైన స్థానంగా చెప్పుకునే భువనగిరి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోవడం గమనార్హం. తన గెలుపుకు కారణమైన ప్రజలకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. అధికార పార్టీ తరపున బరిలో నిలిచిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 19 వేల 70 ఓట్ల మోజారిటీతో గెలుపోందారు. ఇక అత్యంత ఆస్తక్తిని రేపిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోనూ అనుకున్నట్లుగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయధుంధఃభి మ్రోగించారు. తన సమీప ప్రత్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై 8 వేల 7 వందల పైచిలుకు ఓట్లతో గెలుపోందారు.
అత్యంత ఉత్కంఠకు తెరలేపిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ స్థానంలో కూడా కాంగ్రెస్ విజయగంటను మ్రోగించింది. ఈ స్థానం మునుపెన్నడూ లేని ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఇక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో నిలవడమే. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన సొంత నియోజకవర్గం కొడంగటల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో మల్కాజ్ గిరి లోక్ సభ నుంచి బరిలో దిగిన ఆయనతో గెలుపోటములు ఆద్యంతం దోబుచులాడాయి. చివరకు ఆయనను విజయం వరించింది. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి 6270 ఓట్ల మెజారీటీతో ఘనవిజయాన్ని సాధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more