కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపి వాడిన ఆకర్ష్ పాచిక.. ఇన్నాళ్లుగా పారకపోయినా.. ఇప్పుడిక పారాల్సిందేననా.? కుమారస్వామి పదవీచుత్యుడు కావాల్సిందేనా.. తండ్రి దేవెగౌడ తరహాలో కుమారస్వామికి కూడా సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే మళ్లీ అధికారం అని తేల్చేయడంతో.. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వాలు కూలిపోతాయన్న ప్రచారం జోరందుకుంది. ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు అకర్షించేందుకు బీజేపి కొత్త అలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని కేంద్ర మంత్రి సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు ఈ మేరకు ప్రకటను చేసిన యడ్యూరప్ప మౌనంగా వున్న సమయంలో సదానంద గౌడ.. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఈ ప్రకటన ఆయనే చేశారా.? లేక ఆయన చేత.. పార్టీ పెద్దలే వెనకుండి ఇలా చెప్పించారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, సదానందగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ జోకర్ అని రోషన్ బేగ్ తిట్టిపోసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్ బేగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో రోషన్ బేగ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించిన సదానంద గౌడ.. రేపు సాయంత్రం వరకే కుమార స్వామి సీఎం పోస్టులో ఉంటారని అనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆస్తకికరంగా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more