ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి విపక్షాలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల కమీషన్ కూడా కేంద్ర చేతిలో కీలుబోమ్మలా వ్యవహరిస్తోందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. తాజాగా సీఈసీ తీసుకున్న మరో నిర్ణయం కూడా వారి విమర్శలకు బలం చేకూర్చనుంది. దేశసర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడుకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ వీవీప్యాట్ లను స్లిపులను నూరుశాతం ఈవీఎంలతో సరిపోల్చాలని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పిటీషన్ ను కోట్టివేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశంలోని అన్ని బీజేపీయేతర రాజకీయ పక్షాలు కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి.. వీవీఫ్యాట్ స్లిపులను లెక్కించిన తరువాతే ఈవీఎంలను తెరవాలని కోరాయి. కాగా, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేది లేదని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆఘమేఘాల మీద సమావేశమైన సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మే 23న ఎన్నికల ఫలితాల సందర్భంగా మొదట వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈనెల 21న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది. దీంతో సునీల్ అరోరా నేతృత్వంలోని సీఈసీపై విపక్షాలు పెదవివిరుస్తున్నాయి. అధికార పక్షానికి తలొగ్గి కేంద్రఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప.. తమకు అనుకూలంగా కాదని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more