దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉన్నాయి. తుఫాను మందు ప్రశాంతతను తలపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇంధన ధరలు కాస్త అటుఇటుగా స్థిరంగా వున్నాయి. మార్చి 10కి ముందు రెండు నెలలతో పోలిస్తే 1 శాతం కంటే తక్కువగా పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే వాహనదారులపై కేంద్రప్రభుత్వానికి ఇంత ప్రేమను ఎందుకు కనబరుస్తుందా.? అన్న అలోచనలో మీరు పడలేదని తెలుసు.
ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల పోలింగ్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇంధన ధరలు పెంచితే దాని ప్రభావం కూడా ఓట్లపై పడుతుందని కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం భావించింది. దీంతో అంతర్జాతీయంగా ధరల ప్రభావం ఎలా వున్నా.. దేశీయంగా మాత్రం ధరలు స్థిరంగానే వుండేట్లు చూసుకునేలా చర్యలను చేపట్టింది. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి నుంచి పెట్రోల్ ధరలు సుమారుగా 3.5 శాతం మాత్రమే పెరిగాయి.
కేంద్రంలో బీజేని నేతృత్వంలోని ఏన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో అప్పటివరకు నెలకు రెండు పర్యాయాలుగా మారే ఇంధన ధరలను.. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో రోజూవారీగా మారుతువుండటం ప్రారంభంమైంది. లోక్ సభ ఎన్నికల వేళ ఇంధన ధరలు స్థిరంగా ఉండిపోవడంతో వినియోగదారులకు కాస్త రిలీఫ్ దొరికినట్టుయింది. ఇంధన ధరల పెంపు ఆలస్యం కావడంతో ఆయిల్ కంపెనీలు ఎన్నికలు అయ్యేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు వరకు రోజువారీ పెంపుతో వినియోగదారుల నడ్డివిరిచిన ఆయిల్ కంపెనీలు మే 19 కోసం ఎదురుచూస్తున్నాయి.
లోక్ సభ చివరి దశ ఎన్నికలు మే 19తో ముగియనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇన్నాళ్లు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిల్ కంపెనీలు ప్రెటో బాంబును ఎంతలా పేల్చుతారోనన్న అందోళన వాహనదారుల్లో నెలకోంది. ఎన్నికల సమయంలో స్థిరమైన ఇంధన ధరలతో రిలీఫ్ గా ఉన్న వినియోగదారుడు.. రెండు చివరి దశలకు పోలింగ్ కు సమయం సమీపిస్తున్న క్రమంలో ధరల మోత మోగనుందని తెలిసి కంగారుపడుతున్నాడు.
ఇంధన ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలు ఆలస్యం చేయడానికి లోక్ సభ ఎన్నికలే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ సొంత పాలసీతో రోజువారీ ధరల పెంపు పాలసీని ఉల్లంఘించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉండేలా ఆయిల్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం సూచించడం వల్లే ధరలను రివైజ్ చేయలేదని మండిపడింది. ఎన్నికలు ముగిసిన అనంతరం భారీగా పెరిగే ఇంధన పన్నులను ప్రభుత్వం తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేశారు. ఇంధన పన్ను తగ్గించకపోతే.. వినియోగదారులు అధిక మొత్తంలో ఇంధన ధరలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more