ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న మన దేశంలో.. ఓటు అనేది రహస్య బ్యాలెట్. ప్రచారం ఎవరు ఎవరికీ చేసుకున్నా.. ఓటు వేయడం మాత్రం ఎవరు ఎవరికి వేస్తున్నారో కూడా తెలియకూదన్న నిబంధనలు వున్నాయి. కానీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవంతో యువ ఓటర్లు తమ ఓట్లను సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్నారు. అంతేకాదు.. తాము ఏ పార్టీకి ఓటు వేశామన్నది కూడా స్పష్టంగా కనిపించేలా వీడియోలు తీసీ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది.
ఖమ్మం జిల్లా బూర్గంపాడులో పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించకూడదన్న నిబంధలన వున్నా అధికారులు ఆ నిబంధనలకు నీళ్లు వదిలేయడంతో. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇంకేముందీ.. తాము తీసిన వీడియోలను వాట్సాప్, ఫేస్ బుక్ లో షేర్ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. దీంతో వారు ఏ పార్టీకి ఓటు వేశారో, ఏ గుర్తుకి ఓటు వేశారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. టీఆర్ఎస్ గుర్తుకి ఒకరు, కాంగ్రెస్ గుర్తుకి మరొకరు ఓటు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఓటు ఎవరికి వేశామన్నది రహస్యంగా ఉంచాలి. ఓటు వేయడాన్ని షూట్ చెయ్యడం కానీ, ఫొటోలు తియ్యడం కానీ చెయ్యరాదు. బూర్గంపాడు పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధమైన పనులు జరుగుతున్నా.. ఎన్నికల అధికారులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఎన్నికలు అధికారుల తీరుపై పార్టీల నాయకులు, అభ్యర్థులు మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు సోమవారం (మే 6,219) పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 197 జెడ్పీటీసీ.. 2వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 7వేల 72మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more