సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారులు ఇవాళ విడుదలచేశారు. గత ఏడాది కన్నా ఈ సారి ఉత్తర్ణీత శాతం పెరిగింది. గత ఏడాది కన్నా ఏకంగా 4.4శాతం ఉత్తర్ణత పెరిగింది. ఏకంగా 13 మంది విద్యార్థులు 499 మార్కులను సాధించారు. అయితే వీరిలో 8 మంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారే కావడం గమనార్షం. మిగిలిన వారిలో ఇద్దరు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, కేరళ నుంచి ఒక్కో విద్యార్ధి టాపర్ గా నిలిచారు. ఇక 498 మార్కులను సాధించిన విద్యార్థులు 25 మంది వున్నారు.
ఈసారి పదో తరగతి పరీక్షల్లో 57 వేల 256 మంది విద్యార్థులు 95శాతానికి పైగా మార్కులను సాధించారు. గత ఏడాది 86.7 ఉత్తీర్ణ శాతం నమోదు కాగా, ఈ సారి 91.1 ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా ఈ సారి కూడా త్రివేండ్రమ్ విద్యార్థులే మరోమారు సత్తా చాటి తమ అగ్రస్థానాన్ని మరోమారు నిలబెట్టకున్నారు. విద్యార్థులు www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in అనే వెబ్సైట్లలో తమ ఫలితాలు చూసుకోవచ్చని సీబీఎస్ఈ ప్రకటించింది.
ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 18,27,472 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో ఏకంగా 5.69.695 మంది విద్యార్థులు ఒక్క దేశరాజధాని ఢిల్లీ నుంచే వుండటం గమనార్హం. ప్రతీ ఏడూ పరీక్షా ఫలితాలను త్వరగా వెల్లడించే ఐసీఎస్ఈ బోర్డు కన్నా ముందుగానే ఈసారి సీబీఎస్ఈ బోర్డు తమ ఫలితాలను వెల్లడించింది. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్ నోయిడాకు చెందిన సిద్దాంత్ పెన్ గోరియా, దివ్యాంశ్ వాద్వా టాపర్స్ గా నిలిచారు.
ఈ ఏడాది తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర బోర్డుల కంటే ముందే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. సీబీఎస్ఈ పదో తరగతి-2019 ఫలితాలను ఇతర వెబ్సైట్లు అయిన examresults.in, indiaresults.com, results.gov.inలోనూ చెక్ చేసుకోవచ్చు. కాగా, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా 1800 11 8004 నంబరును సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఫలితాల డిజిటల్ సర్టిఫికెట్లను www.digilocker.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in సైట్ను ఓపెన్ చేయండి
హోం పేజీలోకి వెళ్లి ‘క్లాస్ 10 రిజల్ట్స్ 2019’ పై క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా రూల్ నంబరును, ఇతర వివరాలను ఎంటర్ చేయండి
ఫలితాలు స్క్రీన్పై చూపించాక, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more