బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలాన్ని పుంజుకుని వాయుగుండంగా, అటునుంచి తుపాను, పెను తుఫానుగా రూపాంతరం చెందిన ఫణి.. అతితీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫణి తుపాను, మరికొన్ని గంటల్లో తీవ్ర పెనుతుఫానుగా మారనుంది. కాగా ఇది మే నెల 3న ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని దాటనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఇప్పటికే డిసాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన 20 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ 12 యూనిట్లు అప్రమత్తంగా వున్నాయి.
మే 1న తీవ్ర పెను తుఫానుగా మారనున్న ఫణి.. 2 లేదా 3వ తేదీల్లో తీరం దాటుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీషనర్ బిష్ణుపంథా సెథీ తెలిపారు. కాగా దీని ప్రభావం ఒడిశా, అంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లపై అధికంగా వుంటుందని ఆయన తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో ఇది తీరం దాటనుంది. ఆ సయంలో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాలతో పాటు సైన్యాన్ని కూడా అప్రమత్తం చేసింది కేంద్రం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపింది.
ఇందులో భాగంగా ప్రకృతి విపత్తు నిధుల కింద ముందస్తుగానే ఏపీకి రూ.200 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల వేళ ఫొని తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో.. ఏపీతో పాటు తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.1,086 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఏపీకి రూ.200 కోట్లు, ఒడిశాకు రూ.340 కోట్లు, తమినాడుకు రూ.309 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.235 కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తుపాన్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more