కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంపై అంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ నుంచి విమక్తి కల్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి చేతులు కాల్చుకున్న బీజేపి నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. తాజాగా మరో పిటీషన్ దాఖలు చేశారు. గత మూడేళ్లలో టీటీడీకి చెందిన ఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పిటీషన్ ను తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు సూచన మేరకు ఆయన దాఖలు చేసిన టీటీడీ సహా మరో 11 దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ నుంచి విముక్తి కల్పించాలన్న ప్రధాన వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యం వేసవి సెలవులపై విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
టీటీడీ, తిరుచానూరు పద్మావతి దేవితో పాటు మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి, ఢిల్లీకి చెందిన సత్యపాల్ సభర్వాల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆలయాలపై ప్రభుత్వానికి అధికారాన్ని కల్పించే హిందూ ధార్మిక సంస్థల, దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్లను రద్దు చేయాలని వీరు కోరారు. కాగా ఈ పిటీషన్ ను విచారించిన ధర్మాసనం టీటీడీ స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి ..ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more