సలీం సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో ఇటీవలే ఎర్రమంజిల్ కోర్టు విధించిన జైలు శిక్ష నేపథ్యంలో బెయిల్ తెచ్చుకుని ఊపిరి తీసుకుంటున్న సినీ నటుడు, నిర్మాత, వైసీపీ నేత మోహన్ బాబుకు మరోమారు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి. ఇవాళ మరోమారు మోహన్ బాబుకు ఆయన లీగల్ నోటీసులు పంపారు. అయితే ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను మోహన్ బాబు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వైవీఎస్ చౌదరి అరోపిస్తూ ఓ లేఖను విడుదల చేశారు.
చెక్ బౌన్స్ కేసులో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి మోహన్ బాబు తనను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కోన్నారు. ఈ మేరకు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. తన స్థలాన్ని అక్రమించి.. తన స్థలంలోకి తనను రానీయకుండా ఆక్రమిస్తున్నారని ఆయన అరోపించారు. సలీం చిత్ర నిర్మాణ సమయంలోనే జల్పల్లి గ్రామంలో మోహన్ బాబు నివసిస్తున్న ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎకరం స్ధలాన్ని వైవీఎస్ చౌదరి కొన్నానని చెప్పారు.
చెక్ బౌన్స్ కేసు తీర్పు అనంతరం మోహన్ బాబు, ఆయన మనుషులు.. తన స్ధలంలోకి. తనను, తన మనుషులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని చౌదరి ఆరోపించారు. తాను కష్టార్జితంతో కొనుకున్న స్ధలం విషయంలో మోహన్ బాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని అరోపించారు. అంతేకాదు తన స్థలంలో బౌన్సర్లను పెట్టి వారితో తనను అడ్డుకుంటున్నారని అరోపిస్తున్న ఆయన.. శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణుల సలహా తీసుకుని మోహన్ బాబుకు లీగల్ నోటీసులు పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more