తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయాక కూడా అభివృద్ధిలో శూన్యంగానే ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనసేన-బిఎస్పీ సభలో మాట్లాడిన మాయావతి రాష్ట్రం విడిపోయిందని, అయితే రాష్ట్ర ప్రజల స్థితిగతులలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
దేశంలో కాంగ్రెస్-బీజేపీల పాలనలో ఎస్సి, ఎస్టీలకు న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ఇలాంటి పోరబాట్లు చేసి అణగారిన వర్గాలకు దూరంగా జరగడంతో ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైందని అన్నారు. ఇక అదే పంథాలో నడుస్తున్న బిజెపికి కూడా రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. దేశంలో అభివృద్ది వేగంగా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రస్తుత పాలన అభివృద్ది ఆమడదూరం అన్నట్లు సాగుతుందని ఎద్దేవా చేశారు.
అభివృద్ది విషయంలో ఎన్టీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. నిరుద్యోగులకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారని.. అయితే ఐదేళ్లు పూర్తికావస్తున్నా.. ఇప్పటికీ నిరుద్యోగులు ఎధురుచూపులకు ఇంకా ఎక్కడ వేసిన గొంగల అక్కడే అన్న చందంగా వున్నాయిని అన్నారు. దీనికి తోడు నోట్లరద్దు, జీఎస్టీ వంటి చర్యలతో దేశంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎపిలో ప్రజలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. తెలంగాణలో ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more