ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై సంచలన అరోపణలు చేసిన ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆయన దుమ్ముదులిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతీ స్కీంలో ఒక స్కాం దాగివుందని చెప్పాన ఆయన.. తన బినామిలీకు వేల కోట్ల రూపాయలను దోచిపెట్టారని అరోపించారు. అమరావితీలోనూ రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరిగిందని ఆయన అరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా జస్టిస్ ఈశ్వరయ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏమన్నా పతివ్రతా అంటూ విమర్సించారు. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్ పై ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానని అన్నారు. జగన్ బిసిల ద్రోహని, వైసిపి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని అరోపించారు.
విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. శరీరం అమ్ముకున్నవారికి నీతి, విలువ ఉంటుందని, రాజకీయ నాయకులకు ఆ విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకు ఓటెయ్యవద్దని బిసిలకు జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తెలంగాణాలో కెసిఆర్, ఏపిలో చంద్రబాబులు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని జస్టిస్ ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more