కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రం వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. సోదరితో కలిసి రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అమేథి, వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్న రాహుల్. వాయనాడ్కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో చేరుకున్నారు. వేలాది కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం కోసం రాహుల్ బుధవారం సాయంత్రమే కోజికోడ్ వెళ్లారు.
దక్షిణాది నుంచి పోటీ చేయాలనే పార్టీ నేతల డిమాండ్ మేరకు రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన యూపీలోని అమేథీతో పాటు వయనాడ్ నుంచి రాహుల్ ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. వయనాడ్లో కాంగ్రెస్కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానావాస్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్, ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లపల్లితో రాహుల్ తలపడనున్నారు.
ఈ సందర్భంగా.. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశమంతా ఒక్కటే అని చాటి చెప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తమను శత్రువులా చూస్తున్నట్లు దక్షిణాది ప్రజలు భావిస్తున్నారని.. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే భావన దక్షిణాది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని రాహుల్ చెప్పారు. ఈ అంతరాన్ని చెరిపేయడానికే తాను వయనాడ్ నుంచి బరిలోకి దిగినట్లు వివరించారు.
అనంతరం అక్కడ రాహుల్, ప్రియాంక రోడ్డుషో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కోజికోడ్ లో భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు రాహుల్ తన నాయినమ్మ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బాటనలో నడుస్తూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.
అయితే ఈ నామినేషన్ పూర్తయిన అనంతరం ప్రియాంకా గాంధీ భావోద్వేగ సందేశాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీని జాగ్రత్తగా చూసుకోవాలని అమె కోరారు. అమె ట్వీట్ సారాంశమిలా వుంది. ‘‘నా సోదరుడు నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు చాలా ధైర్యవంతుడు. వయనాడ్ ప్రజలారా.. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచడు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Kerala: Congress President Rahul Gandhi files nomination from Wayanad parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/abn2g9ahQE
— ANI (@ANI) April 4, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more