Nandamuri Balakrishna threatens TDP activist in Hindupur బాలకృష్ణ నోట ‘ఇంద్ర’ డైలాగ్.. పీక కోస్తా.. లేపిపాడదోబ్బుతా..

Hindupur mla candidate nandamuri balakrishna threatens tdp activist

Balayya warns TDP activst, balakrishna warns TDP activist, TDP, Nandamuri Balakrishna, Vasundhara Devi, TDP activists, TDP fans, Hindupur assembly, Election Campaign, AP Elections 2019, AP Assembly Elections 2019, Hindupur, Andhra Pradesh, Politics

TDP Hindupur MLA candidate Balakrishna is again in the controversy, this time for threating TDP activists during the election campaign, for saying he will win with 70 thousand majority. This entire conversion was recorded and later gone viral on social media.

ITEMVIDEOS: బాలకృష్ణ నోట ‘ఇంద్ర’ డైలాగ్.. పీక కోస్తా.. లేపిపాడదోబ్బుతా..

Posted: 04/04/2019 06:36 PM IST
Hindupur mla candidate nandamuri balakrishna threatens tdp activist

టీడీపీ కార్యకర్తలపై, అభిమానులపై నోటితోపాటు చేయి కూడా చేసుకుంటూ తరచూ వివాదాల్లోకి చిక్కకునే సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోమారు వార్తల్లోకెక్కారు. తనకు ఎంత మెజారిటీ వస్తుందో ముందే అంచనా వేసిన అభిమానిపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెప్పినంత మెజారిటీ రాకపోతే అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన పాపులర్ డైలాగ్ ను అందుకున్నారు. అంతేకాదు లోపిపారదొబ్బుతా అని కూడా వార్నింగ్ ఇచ్చాడు.

హిందూపురం నుంచి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఈసారి మరింత రెచ్చిపోయారు. పైకి సరదాగా కనిపిస్తూనే..  గొంతు కోస్తా, ఏసేస్తా రేయ్ అంటూ కార్యర్తలను హడలెత్తించారు. పక్కన ఉన్న తన భార్య వసుంధర చూడాలని మరీ తిట్లకు లంకించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలసి హిందూపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అభిమానులపై అగ్గిపడుగయ్యారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు విమర్శలకు దారితీసింది. బాలయ్య మాటలకు, చేష్టలకు అంతా  షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారరథంపై భార్య వసుంధరతో కలసి వెళ్తున్న బాలయ్యను చూసి సంబరంతో ఓ కార్యకర్త.. ‘మీకు 50 వేలు, 60 వేల మెజారిటీ వస్తుంది.. ’ అని అరిచాడు. అప్పటికే  ప్రచారంలో డస్సిపోయి మాంచి కాకమీదున్న బాలయ్య.. వేలల్లో మెజారిటీ ఏంటిరా అయ్యా కస్సుబుస్సుమన్నాడు. ‘హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలి..’ అని భార్యతో అంటూ గొంతుకోస్తున్నట్లు తన తలకింద చేయి పెట్టాడు. కానీ ఆమె పెట్టించోకుండా చేతులూపసాగారు.

తర్వాత మరో కార్యకర్త ‘మీకు 60 వేలు, 70 వేల మెజారిటీ వస్తుంది’ అని అన్నాడు. దీంతో బాలయ్యకు మండిపోయింది. ‘నీ అడ్రసేంటి పేరేంటి. అంత మెజారిటీ రాకపోతే పీక కోస్తా.. ఏసేస్తా’ అని సినీస్టయిల్లో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా లేపిపారదొబ్బుతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ సన్నివేశాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. బాలయ్య సరదాగా అన్నట్లు కనిపించినా.. ఆ తిట్లు, బూతులు ఏంటని విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP activist  Nandamuri Balakrishna  Hindupur  majority  Andhra Pradesh  Politics  

Other Articles