పోలింగ్ సమాయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఎన్నికలు రావడంతో ఓటింగ్ శాతంపై దాని ప్రభావం పడుతుందని భావించిన ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 2019 ఎన్నికల్లో మాత్రం గంట సమయం పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది.
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలు కల్పించేందుకే ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయాన్ని గంట పొడిగించింది. ఓటర్ల సంఖ్య పెరగడం ఓ కారణం. మరో కారణం వీవీ ప్యాట్. మనం ఎవరికి ఓటు వేశాం అని తెలుసుకోవటానికి 7 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారణంతోనూ పోలింగ్ సమయాన్ని గంట పెంచింది ఈసీ. అదే విధంగా సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ బూత్ దగ్గర ఉండే ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పిస్తారు అధికారులు.
ఎండలు మండిపోతుండడంతో సాయంత్రం వేళ వెళ్లి ఓటు వేద్దాంలే అనుకునే ఓటర్లను కూడా ఈసీ దృష్టిలో పెట్టుకుంది. అలాంటి వారికి ఈ గంట సమయం పెంపు ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించింది, ఓటింగ్ శాతం పెంపోందించేందుకు ఎన్నికల కమీషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఈ వెసలు బాటునైనా దేశంలోని ఓటర్లు వినియోగించుకుంటారా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more