కేంద్ర ప్రభుత్వం అదేశించిందో లేక స్వతహాగానే తీసుకుందో కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ రుణగ్రస్తులకు మంచి శుభవార్తను వెలువరించింది. కొత్త అర్థిక సంవత్సరం 2019-20ని పురస్కరించుకుని.. రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇధి ఏప్రిల్ మాసం కాబట్టి మిమ్మల్ని ఫూల్ చేయడం లేదని, పూర్తిగా నిజం అంటోంది.
బ్యాంకుల నుంచి గృహాలు కట్టుకునేందుకు హోంలోన్ తీసుకున్నవారితో పాటు, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి స్వల్ప ఊరటను అందించింది. ఈ రుణాలపై వడ్డీని స్వల్పంగా తగ్గించింది. ఇక నుంచి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులతోపాటు.. గతంలో ఫ్లోట్ విధానంలో ఉన్న హోం, కార్ లోన్లపై కూడా వడ్డీ తగ్గనుంది. 2019, ఏప్రిల్ 4వ తేదీన సమావేశం అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు చైర్మన్ శక్తికాంత్ సింగ్.
రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది RBI. దీంతో ప్రస్తుతం ఉన్న 6.25శాతం రెపోరేటు.. 6శాతానికి దిగి వచ్చింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులపై వడ్డీ తగ్గనుంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఊరట ఇచ్చే అంశం. లక్షలు పోసి బ్యాంకు లోన్ తో ఇల్లు తీసుకున్న వారికి కొంతంలో కొంత ఊరట ఇచ్చే అంశం. కొత్త రెపోరేటు లెక్కన.. 30 లక్షల హోంలోన్ పై నెలకు 400 రూపాయల వరకు వడ్డీ తగ్గనున్నట్లు అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more