నాలుగు నెలల ముందువచ్చిన తెలంగాణ ఎన్నికలలో రైతు బంధు పథకం పేరు చె్ప్పకుని మరోమారు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చే సరికి రైతులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట కవిత నిజమాబాద్ లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అక్కడి రైతులు అమెకు వ్యతిరేకంగా ఏకంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎర్రజోన్న పంటలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, పసుపు మార్కెటంగ్ కు అనువుగా బోర్టును ఏర్పాటు చేస్తామని అంతకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా అమెపై అగ్రహంతో వున్న రైతులు ఏకంగా రాస్తారోకోలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారు కవితకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా ఎర్రజోన్న రైతులు, పసుపు రైతులు ఓ వైపు అమెపై యుద్దం ప్రకటిస్తున్న క్రమం కోనసాగుతుంది.
అ తరుణంలోనే తమకు అందాల్సిన రైతు బంధు చెక్కులు అందకపోవడంతో తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన రైతులు మరో అడుగుముందేకేసి తమ కోపాన్ని వినూత్నంగా ప్రధర్శించేందుకు రెడీ అయ్యారు. తమకు చెక్కులను అందించకుంటే లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఈ ఎన్నికల్లో ఓటేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కేశుపల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు చెక్కులు అందలేదు. అధికారులను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి విసిగిపోయిన గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ నెల 10లోగా రైతు బంధు చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more