కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అధిష్టించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదలకు జన్ ధన్ యోజన పథకాన్ని అందించారు. ఈ పథకం కింద దేశంలోని అనేకమంది అభాగ్యులకు ఎలాంటి ఢిపాజిట్, బ్యాలెన్స్ లేని బ్యాంకు అకౌంట్లను తెరిపించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వాటిల్లో పదిహేను లక్షల రూపాయల వేస్తానని నరేంద్రమోడీ హామి ఇవ్వడం ఆ తరువాత వెంటనే బ్యాంకు అకౌంట్లు తెరిపించడంతో.. నిజంగానే డబ్బులు వేస్తారని పేదలు పోటీపడి మరీ అకౌంట్లు తెరిచారు.
దీంతో బ్యాంకు అధికారులు కూడా విస్తు చెంది జన్ ధన్ యోజన ఖాతాలకు సంబంధించిన అకౌంట్ ధరఖాస్తులు తమ వద్ద లేవని చెప్పి ఉప్పెనలా వస్తున్న అకౌంట్లను తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఈ అకౌంట్లు పెరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా అకౌంట్లు వున్నాయని చెప్పుకోడానికే తప్ప.. వాటిల్లో డబ్బులు మాత్రం పడట్లేదని పేదులు ఆశగా ఎదురు చూసిన పేదలు ఇక తమ కష్టాన్నే నమ్మకున్నారు.
2016 డిసెంబర్ లో పెద్ద నోట్ల రద్దు జరిగిన తరువాత ప్రధాని దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆయన ప్రచారం చేసిన వ్యాఖ్యలతో మళ్లీ పేదల్లో అశలు రేగాయి. మీ అకౌంట్లలో నల్లధన కుబేరులు డబ్బులు వేస్తారు. వాటిని తీసుకోండి కానీ తిరిగి ఇవ్వకండి.. ఎవరైనా బెదిరిస్తే తనకు ఓ చిటీ రాయాలని కూడా చెప్పారు. దీంతో తమ అకౌంట్లలో డబ్బులు వేయమని ఎవరైనా వచ్చి అడుగుతారా.? అని పేదలు పనులు మానుకుని బ్యాంకుల వద్దే పడిగాపులు కాశారు. అయినా ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి.
ఇలా ఐదేళ్లు పూర్తికావస్తున్నా తమ జన్ ధన్ అకౌంట్లలో పదిహేను లక్షలు కాదుకదా.. కనీసం 15 వేల రూపాయలు కూడా జమకాలేదు. దీంతో ఊసురుమంటున్నారు దేశంలోని పేదలు. ఇప్పుడీ జన్ ధన్ అకౌంట్ల గోల ఎందుకు అంటారా.? ఉత్తర్ ప్రదేశ్ లోని ఏకంగా 1700 జన్ధన్ బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లు వచ్చి చేరాయి. అందుకు సంబంధించిన మెసేజ్ ఫోన్లకు చేరడంతో ఖాతాదారులంతా బ్యాంకులకు చేరుకుని తమ అకౌంట్లలోని డబ్బును విత్ డ్రా చేసుకున్నారు. ఈ వార్త దవాణంలో వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
మొరాదాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. ఒక్కో ఖాతాలో 10 వేల రూపాయల చొప్పున మొత్తం కోటీ 70 లక్షల రూపాయలు డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభాలకు గురుచేయడానికి రాజకీయ నాయకులు ఎవరైనా జన్ధన్ ఖతాల్లో డబ్బు జమ చేశారా? లేక ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందిన వారికి బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడు నగదు జమైందా అనే అంశాలను ఈసీ పరిశీలిస్తోంది. అనుమానాస్పద డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more