పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివేసింది.నీరవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇస్తే నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి తెలిపారు.ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్-26,2019కు కోర్టు వాయిదా వేసింది.
కోర్టులో వాదనల సందర్భంగా...నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపించిన టోబే కాడ్ మాన్ చీఫ్ జస్టిస్ కి తెలిపారు. నీరవ్ కు బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశముందని,ఆధారాలను నాశనం చేస్తాడని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదముందని టోబే కోర్టుకి తెలిపారు.ఆశిష్ లాడ్ అనే సాక్షికి నీరవ్ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు టోబే కోర్టుకి తెలిపారు.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే విదేశాలకు నీరవ్ మోడీ పారిపోయాడు. నీరవ్ కోసం భారత అధికారులు గాలిస్తున్న సమయంలో కొన్ని రోజుల క్రితం గెటప్ మార్చి లండన్ రోడ్లపై దర్జాగా తిరుగుతున్న నీరవ్ ని స్థానిక రిపోర్టర్ గుర్తించాడు. దీంతో నీరవ్ లండన్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. లండన్ లో ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్ ని గుర్తించిన ఓ బ్యాంకు ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని నీరవ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more