భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను వై-ఫై జోన్లగా మార్చేసింది. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు వినియోగించుకునే వసతిని కల్పించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (మిని రత్నా CPSU) దేశవ్యాప్తంగా వెయ్యి స్టేషన్లలో ఫ్రీ వై-ఫై జోన్లను ఏర్పాటు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. రెండు సంవత్సరాల మూడు నెలల్లో రైల్ వైర్ వై-ఫై ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు వెయ్యి రైల్వే స్టేషన్లను వై-ఫై జోన్లుగా మార్చేశారు.
ఇప్పటివరకూ రైల్ టెల్ 1000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 2016లో ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి రైల్ టెల్ వై-ఫై సర్వీసు ప్రాజెక్టును ప్రారంభించింది. వై-ఫై సర్వీసు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన 1000 రైల్వే స్టేషన్ గా ముంబైలోని సెంట్రల్ రైల్వే రేరోడ్ స్టేషన్ రికార్డు ఎక్కింది. భవిష్యత్తులో మరెన్నీ స్టేషన్లలో వైఫై నెట్ వర్క్ ను విస్తరించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది.
ఇక త్వరలోనే అన్ని రైల్వే స్టేషన్లలో ఉచితంగా వేగవంతమైన రైల్ వైర్ వై-ఫై సర్వీసు ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కూడా వై-ఫై సర్వీసులను అందుబాటులోకి రానుంది. తద్వారా డిజిటల్ పరంగా హబ్ గా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైల్ వైర్ అనే రిటైల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ నుంచి రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఉచితంగా వై-ఫై నెట్ వర్క్ ను అందించనున్నారు. ప్రయాణికుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కేవైసీ ఆధారంగా ఉచితంగా వైఫై సర్వీసును సులభంగా యాక్సస్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
రైల్ టెల్.. హైస్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని పలు రైల్వే స్టేషన్లలో అందించింది. టెక్నాలజీ పార్టనర్ గూగుల్, రేడియా యాక్సస్ ఆధారంగా రైల్ టెల్ ఈ వై-ఫై సదుపాయాన్ని ఆయా స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ వైఫై సర్వీసులను అందించడమే లక్ష్యంగా రైల్ టెల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వై-ఫై సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లలో ఫిబ్రవరి 2019 నెలలో మొత్తం 1,15,77,141 మంది యూనిక్ యూజర్లు ఉచితంగా వైఫై సర్వీసును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more