నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో తన సోదరి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఏకంగా 180 మంది ఎర్రజోన్న, పసుపు రైతులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అమె విజయం గతంలో మాదిరిగా నల్లేరుపై నడక మాత్రం కాదని తేలిసిపోతుంది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు అమె విజయానికి అందివచ్చే ప్రతీ ఒక్కరిని పార్టీలోకి కలుపుకుంటూ ముందకువెళ్తున్నారు. ఐదేళ్ల పాటు అధికార పార్టీ అండదండలతో తమ పనులను కూడా ఎంచక్కా చక్కబెట్టుకోవచ్చని నేతలు కూడా పిలుపు రాగానే అలస్యం చేయకుండా వెళ్లి గులాభి కండువా కప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా, మంత్రి పదవులు వెలగబెట్టిన నేతలే ఇలా గులాబి గూటికి చేరి స్వాంతన పోందుతున్న తరుణంలో ఇక మాజీ మాత్రం తమకు అందివచ్చిన అవకాశాన్ని ఎలాజార్చుకుంటారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు భారీ ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.
నర్సారెడ్డి టీఆర్ఎస్ లో చేరటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, పార్టీ నర్సారెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తుందని చెప్పారు. నిజామాబాద్ కు చెందిన అరికెల నర్సారెడ్డి గతంలో టీడీపీలో ఉండగా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2016 లో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. టీఆర్ఎస్ లో చేరటంపై నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ది సంక్షేమ పధకాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్ధానాలను గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more