కాంగ్రెస్ నగదు బదిలీ పథకంపై ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ఆయన తొలి బీజేపి బహిరంగసభలోనే కాంగ్రెస్ నగదు బదిలీ పథకంపై విరుచుకుపడ్డారు. 70 ఏళ్ల పాలనలో పేదవాడి పేరుతో బ్యాంకు అకౌంట్ కూడా తెరిపించలేని కాంగ్రెస్.. ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. కనీసం పేదవాడి పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిపించలేని వాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. భారత్ ను స్పేస్ పవర్ గా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి తన ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. తొలి ఎన్నికల సభలోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన ''ప్రతి పేదవాడికి కనీస ఆదాయం' పథకంపై ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మాటలు తనకు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. మేము ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో వాళ్లు డబ్బు వేస్తారంట.. అని మోడీ సెటైర్లు వేశారు.బీజేపీ హయాంలో దేశంలోని ప్రతి ఒక్కరు అభివృద్ధి ఫలాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు.
బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి మీదే కాదు అంతరిక్షంలోనూ సర్జికల్ స్ట్రయిక్స్ చేసి చూపించామన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ ర్యాంక్-వన్ పెన్షన్ తాము నెరవేర్చామన్నారు. జన్ ధన్ యోజన కింద 34 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచామని వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా జీవించాలన్నదే తమ లక్ష్యం అని మోడీ చెప్పారు. త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తా అన్నారు. ఇటువైపు నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది.. అటువైపు ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన వారున్నారు అని కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ విమర్శించారు. మా విజన్ నవ భారత నిర్మాణం అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more