బ్యాంకుల్లోని ప్రజాధానాన్ని రుణాలుగా పొంది ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మరో అర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కోసం భారత అధికారులు లండన్ వెళ్లనున్నారు. నిరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ సంయుక్త బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది. పీఎంఎల్ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు ఇటీవల లండన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు నీరవ్ ను ఈ నెల 29 వరకు జుడీషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
కాగా తన జుడీషియల్ రిమాండ్ నేపథ్యంలో నీరవ్ మోడీ.. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై లండన్ కోర్టులో విచారణకు రానుంది. అయితే నిరవ్ మోడీ కేసు విషయంలో లండన్ అధికారులకు సహకారం అందించేందుకు భారత్ కు చెందిన సీబీఐ-ఈడీ అధికారులతో కూడిన సంయుక్త బృందం లండన్ వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు నీరవ్ అప్పగింతకు సంబంధించిన పత్రాలతో లండన్ కు సిద్ధమవుతున్నట్టు అధికారి ఒకరు చెప్పారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి కూడా నీరవ్ మోడీ భార్య అమికి సంబంధించి ఆస్తుల అటాచ్ మెంట్ పై దాఖలైన లేటెస్ట్ ఛార్జ్ షీట్ ను కూడా తీసుకెళ్లననున్నారు. లండన్ కు వెళ్లగానే ముందుగా సీబీఐ-ఈడీ బృందం పలువురు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారికి నీరవ్ కేసుకు సంబంధించి సేకరించిన తాజా వివరాలను వివరించనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2 బిలియన్లు రుణాలుగా తీసుకుని మోసం చేసినందుకు వజ్రాల వ్యాపారి, అతని మామ మెహల్ చోస్కీపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more