ప్రపంచ అగ్రగామి దేశాలుగా బాసిల్లుతున్న అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో అద్భుత ఘనతను ఇండియా కూడా సాధించింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో విప్లవాత్మక అభివృధ్దిని సాధించిన క్రమంలో అదే సాంకేతిక మద్దతుతో అంతరిక్ష రంగంలో కూడా భారత్ సత్తా చాటింది. భారత్ కూడా స్పేస్ పవర్ గా అవతరించింది. ఈ మేరకు భారత ప్రధనమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ… ప్రపంచంలో స్పేస్ పవర్ గా మారిన నాలుగో దేశం భారత్ అని పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కాలం చెల్లిన శాటిలైట్ ను కూల్చివేశారని ప్రకటించారు. ‘మిషన్ శక్తి’ పేరుతో చేసిన అత్యంత కఠినమైన ఈ ఆపరేషన్ ను భారత్ విజయంవంతంగా పూర్తి చేసిందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా స్పేస్ పవర్ గా ఎదిగిందని ఆయన ప్రకటించారు.
ఈ విజయంతో భారత్ మరింత సురక్షితంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని భారత్ కోరుకుంటోందని, యుద్ధ వాతావరణ ఏర్పడటం తమ ఉద్దేశ్యం కాదన్నారు. అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేశారని, దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.
మిషన్ శక్తి ఏంటీ!
మన ఇస్రో శాస్త్రవేత్తలు లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని కూల్చేశారు. భూమికి 300 కిలోమీట్లర ఎత్తులో పేల్చివేశారు. యాంటీ శాటిలైట్ (ఏ శాట్) మిస్సైల్ ద్వారా ఎల్ఈవో(లోయర్ ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాన్ని నేలకూల్చారు. కేవలం 3 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. ముందుగా ఓ లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత మిసైల్స్ ద్వారా దాన్ని కూల్చేశారు. భవిష్యత్ తో శాటిలైట్ల ద్వారా జరిగే దాడులను, గూఢచర్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. అంతరిక్షంలోని శాటిలైట్లను కూల్చివేయగల సామర్ధ్యం ఉన్న మిస్సైల్స్ ను తయారు చేయటం భారత్ ఘనత.
300 కిలోమీటర్ల ఎత్తులో.. అంతరిక్షం లక్ష్యాలను కూడా ఛేదించగల మిస్సైల్స్ ను తయారు చేయటం DRDO సాధించిన అద్బుతం. దేశంపై నిఘా పెట్టే శాటిలైట్లను కూల్చివేయటానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. శత్రుదేశాలు అంతరిక్ష యుద్ధానికి దిగితే.. సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఇదే చేసింది భారత్. ఏశాట్ టెక్నాలజీని ఉపయోగించిన తొలి దేశం అమెరికా. 1958లోనే అమెరికా ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత 1964లో రష్యా, 2007లో చైనా ఈ ఘనత సాధించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more