రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభ జరుగుతుందని అనగానే వేలాది మంది జనం రావడం పరిపాటి. దీంతో పాటు ఇక సినీనటి, పార్లమెంటు సభ్యురాలు వస్తుందంటే ఇక ఆ సభకు ప్రజలను డబ్బులిచ్చి తరలించాల్సిన అవసరం లేదు సరికదా.. ఇసుకేసినా రాలనంత జనం వస్తారు. అయితే ఐదేళ్ల క్రితం అలాగే వున్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 2016లో జరిగిన నోట్ల రద్దు తరువాత కూడా అక్కడి రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడలేదు. అయితే ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
నీరాజనాలు పట్టిన ప్రజలే ఇప్పుడు తమ ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే వెనుదిరుగుతున్నారు. దీంతో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ ప్రాంతవాసి కాకపోయినా.. గత ఎన్నికలలో వలసరాజకీయ వాదిని అదరించిన ఓటర్లు ఈ సారి మాత్రం అందుకు సుముఖంగా లేరు. దీంతో ఐదేళ్ల కిత్రం నల్లేరుపై నడకగా సాగిన నటి పార్లమెంటు ప్రయాణం.. ఈ సారి మాత్రం కష్టతరంగా మారనుంది. ఐదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా వినిపించిన మోడీ ప్రభంజనం.. ఈ సారి ఉత్తరభారతంలోనే కనిపించకపోవడం కోసమెరుపు. ఇక ఉత్తరభారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ లో ఈ పరిణామాలు ఉత్పన్నం కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఇపుడిపుడే ఊపందుకుంటోంది. జనం మాత్రం ఎన్నికల సభల పట్ల పెద్ద ఆసక్తి ఉన్నట్లు లేదు. మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని పోటీ చేస్తున్నారు. మధురలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హేమమాలినితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. జనం మాత్రం లేక సభ వెలవెల పోయింది. సభ ప్రారంభంలో ఈ పరిస్థితి ఉన్నా... తరవాత సీఎం వచ్చి సభలో మాట్లాడినా.. జనం ఎవరూ రాలేదు. పైగా ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోవడాన్ని ఎన్డీటీవీ చూపించింది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికలకు భిన్నంగా సాగుతున్నట్లు ప్రచార సరళి స్పష్టం చేస్తోంది. బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేయడం బీజేపీ సభలో తీవ్ర ప్రభావం చూపిస్తోందని స్థానిక రాజకీయ నేతలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more