తెలంగాణలో మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1.48 కోట్ల మంది కాగా, మహిళలు 1.46 కోట్ల మంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత కల్పిస్తూ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ శుక్రవారం ఓటర్ల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,18,964గా ఉంది. వీరిలో పురుషులు 1,48,42,619 కాగా.. మహిళలు 1,46,74,977, థర్డ్ జెండర్ 1368 ఓట్లు వున్నాయి.
వీరిలో సర్వీస్ ఓటర్లు 10,307, ఎన్నారైలు 1,122, దివ్యాంగలు 4,69,030, 18 ఏళ్లు దాటిన వారు 5,99,933 ఉన్నారు. సవరణ సందర్భంగా 26,23,853 దరఖాస్తులు రాగా, 2,45,089 దరఖాస్తులను తిరస్కరించారు. 23,78,764 దరఖాస్తులను పరిష్కరించారు. తొలిసారి ఓటరుగా నమోదు చేసుకున్న వారు 19,15,240 కాగా ఇందులో 17,72,102 దరఖాస్తులు పరిష్కరించి వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించారు. ఇక, 1,95,369 మంది డూప్లికేట్ ఓటర్లు, 44,721 మంది మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు రజత్ కుమార్ చెప్పారు.
మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల తదుపరి జాబితాలో కొత్తగా 17.72 లక్షల మంది చేరారు. ఇందులో 18-19 ఏళ్ల వయసున్న వారు 5.99 లక్షలుగా ఉన్నారు. కాగా, జనాభాతో పోలిస్తే రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. ప్రతి 1000 మంది జనాభాకు 762 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇక, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు గాను 989 మంది మహిళా ఓటర్లున్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల కోసం మార్చి 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం కుత్బుల్లాపూర్ కాగా అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more