సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అత్యంత పెద్ద హామీని దేశంలోని పేదలపై కురిపించింది. దేశంలోని పేదరికాన్ని తమ పార్టీ ఖచ్చితంగా తొలిగించే దిశగా చర్యలు తీసుకుంటుందని.. అందుకు తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని ఎన్నికల హామీని కురిపించింది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీ వేదికగా ఈ హామీని గురించిన వివరాలను తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి అయినట్లు తెలిపారు.
ఈ పథకం వివరాలను రాహుల్ ప్రకటించారు. దేశంలోని 20 శాతం మంది అత్యంత పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.72,000 జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలోని 25కోట్ల మంది ప్రజలు నేరుగా లబ్ది పొందుతారని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్న ఆయన ఆర్థికంగా ఇది సాధ్యమే అని తెలిపారు. అయితే తమవి ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఉత్తత్త హామీలు కావని చెప్పిన ఆయన పరోక్షంగా బీజేపిని టార్గెట్ చేశారు.
అంతేకాకుండా ప్రతి కుటుంబానికి నెలకు రూ.12వేలు ఆదాయం పొందేలా చేస్తామన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ని తాము గతంలో సమర్థవంతంగా అమలుచేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు.దేశంలో పేదరికాన్ని పారదోలుతామన్నారు.ఇదొక చారిత్రక పథకం అని తెలిపారు.ఈ పథకం వివరాలు మీడియాకు వెల్లడించిన తర్వాత.. ఆశ్చర్యపోయారా అంటూ రాహుల్ ప్రశ్నించారు.తొలి విడత పోలింగ్ నామినేషన్లకు చివరి రోజు రాహుల్ ఈ చారిత్రక పథకం వివరాలను ప్రకటించారు.
Rahul Gandhi: Congress party promises that India's 20%,most poor families will get yearly 72,000 rupees in their bank accounts under minimum basic income guarantee scheme pic.twitter.com/cGWcUErPRh
— ANI (@ANI) March 25, 2019
Congress President Rahul Gandhi: Log mujhse poochte hain ki ye minimum aamdani ki line kya hogi to line jo hai 12,000 rupaye mahine ki hogi. pic.twitter.com/mRJRlslWqb
— ANI (@ANI) March 25, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more