సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కు కేంద్రం ఎన్నికల కమిషన్ ఇవాళనోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 21న హోలీ, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరించోమని అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్ సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు కేవలం ఆరు రోజులు మాత్రమే అంటే ఈ నెల 25తో ముగియనుంది.
మార్చి 26న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. దీంతో ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులు కూడా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. కాగా, 21 హోలి, 24 అదివారం సందర్భంగా ఈ రెండు రోజులు నామినేషన్ల స్వీకరించరు ఎన్నికల అధికారులు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరుకుంది.
గత ఎన్నికలతో పోలిస్తే 1,72,211 మంది ఓటర్ల పెరుగుదల నమోదయ్యింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఓటర్లు సంఖ్య 3,67,60,880గా ఉంది. సమగ్ర ప్రత్యేక సవరణ అనంతరం ఈసీ ప్రకటించిన తుది జాబితా 2019లో 3,69,33,091 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో ఓటర్లు పెరగ్గా, 59 చోట్ల తగ్గడం విశేషం. జిల్లాలవారిగా చూస్తే అత్యధికంగా 40,13,770 లక్షల ఓటర్లతో తూర్పుగోదావరిలో తొలిస్థానంలోనూ, అత్యల్పంగా 17,33,667 లక్షల ఓట్లతో విజయనగరం చిట్టచివరన నిలిచింది.
నియోజకవర్గాల పరంగా రంపచోడవరం అత్యధికంగా 1,04,475 ఓట్లు పెరిగితే, చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో అత్యధికంగా 53,286 ఓట్లు తగ్గాయి. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కలిపి సుమారు 2.50 లక్షల మందిని వినియోగిస్తున్నారు. తెలంగాణలో జనవరి 1న ప్రకటించిన జాబితా ప్రకారం 2.95 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మార్చి 15తో ముగిసింది. ఓటర్ల తుది జాబితాను మార్చి 25న ప్రకటించనున్నారు. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య కాస్త అటూఇటూగా 2.98 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more