బుల్లితెర హాట్ యాంకర్, టాలీవుడ్ హీరోయిన్ రష్మి మరో వివాదం చిక్కుకుంది. తన అభిమానులకు తన ఘాటైన సమాధానాలతో బదులుచెప్తూ దూసుకుపోతున్న రష్మీ.. క్రితం రోజు రాత్రి తన కారుతో రోడ్డు దాటుతున్న బాటసారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి విషమంగా వుందని వైద్యవర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రష్మి ప్రయాణిస్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన అతన్ని మొదట దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుడు చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగే సమయానికి రష్మి తన తల్లితో సహా కారులోనే ఉందని.. యాక్సిడెంట్ తరువాత ఆమె ప్రమాద స్థలం నుండి మరో కారులో వెళ్లిపోయినట్టు తెలిస్తోంది.
కాగా, టీఎస్11 ఇఇ 1789 నంబర్ గల ఈ కారుపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణపై ఆరుకి పైగా చలానాలు ఉండటం విశేషం. 2015 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2019 వరకూ రాంగ్ పార్కింగ్, జీబ్రా క్రాసింగ్ జంప్ తదితర అతిక్రమణల కింద రూ. 800పైగా ఫైన్ ఉంది. కాగా ఇదే కారు విశాఖలో ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో రష్మి కారు డైవర్ ఎం.ఎ గౌతమ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఏం జరగకూడదని అమ పోలీసులకు చెప్పి.. బాధితుడ్ని సూపర్ స్పెషాలిటీ అస్పత్రికి తరలించిందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more