ఏటిఎమ్ కార్డు లేకుండా ఏటిఎమ్ డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఏటిఎంలలో ఇటువంటి సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఏటిఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకునే సౌకర్యం కూడా వుంటే బాగుండు అని అనుకుంటున్నారా..? తాజాగా ఈ అవకాశాన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కల్పిస్తోంది. ఎస్బీఐ తమ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్ ఫామ్ యోనోపై ద్వారా ‘యోనో క్యాష్’ పేరుతో ఈ అవకాశాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న కేవలం 16500 ఏటీయంలలో ఈ యోనో క్యాస్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చి కస్లమర్లకు అధునాతన అవకాశాన్ని కల్పిస్తున్న ఎస్బీఐ త్వరలోనే మరో 60 వేల ఏటీయం కేంద్రాలలో కూడా ఈ అవకాశాన్ని కల్పించనుంది. దీంతో ఆయా ఏటియం కేంద్రాలలో ‘యోనో క్యాష్’ యాప్ ద్వారా ఏటీయం కార్డు లేకుండా డబ్బును విత్ డ్రా చేసుకునే వెసలుబాటు కల్పిస్తుంది.
యాప్ ద్వారా డబ్బులు డ్రా చేయాలంటే ఈ విధానాన్ని పాటించాలి.
* ఈ యోనో యాప్ ను ముందుగా మీ మోబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి
* ఆ యోనో యాప్కు ముందే ఒక ఆరు అంకెల సెక్యురిటీ పిన్ ను పెట్టుకోవాలి
* ఆ పిన్ను ఎంటర్ చేయగానే ఒకవేళ డబ్బు అకౌంట్ లో ఉంటే ఆరు అంకెల ఓటీపీ నంబర్ ను బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసిన నంబర్ కు పంపిస్తారు.
* ఆ ఓటీపీ ఎటిఎం కేంద్రాలలో ఎంటర్ చేసిన వెంటనే మనకు డబ్బు ఏటిఎమ్ నుండి వస్తుంది.
* ఓటీపీని 30నిమిషాలలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. 30 నిమిషాలలో చేయకుండా ఓటీపీ ఎక్స్ పైరీ అయిపోతుంది
డెబిట్ కార్డుల ద్వారా చలామనిని తగ్గించాలనే ఆలోచనతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ చెప్పింది. కార్డును జేబుల్లో పెట్టుకుని అవి పాడయితే ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడానికి కష్టం అవుతున్నదని ఇబ్బంది పడేవారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటువంటి సేవలను ఉపయోగించిన తొలి బ్యాంకు ఎస్బీఐ అని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more