న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో తాజాగా అందిన సమాచారం ప్రకారం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం పవిత్ర దినంగా భావించి ముస్లింలు అధిక సంఖ్యలో మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకోవడం అనవాయితి. దీంతో మసీదులకు వచ్చే ముస్లింలను టార్గెట్ చేసుకుని ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటితో పెనుప్రమాదం తప్పించుకుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి వెల్లడించారు.
శుక్రవారం రోజును పురస్కరించుకుని న్యూజీల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో గల ఓ మసీదును సందర్శించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు లోపలికి వెళ్తుండగా.. అదే సమయంలో మసీదులోంచి కాల్పులు మోత దద్దరిల్లిండంతో వెనక్కు తగ్గిన ఆటగాళ్లు.. మసీదులోకి వెళ్లకుండా అగిపోయారు. కాల్పుల శబ్దం వినబడటంతో ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే కాకతాళీయంగా కాల్పులు జరిగే సమయంలో అక్కడే వున్నా.. ఆ తరువాత ముష్కరుల విద్రోహచర్యలు గురించి తెలిసిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు భయభ్రాంతులకు గురైయ్యారు.
కాగా, కాల్పుల ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని, అయితే, మానసికంగా కొంత షాక్కు గురయ్యారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆటగాళ్లను హోటల్ రూములకు తరలించామని, పరిస్థితులు చక్కబడే వరకు హోటల్కే పరిమితం కావాలని కోరినట్టు చెప్పారు. కాగా కాల్పుల నేపథ్యంలో బంగ్లాదేశ్ న్యూజీలాండ్ పర్యటనను ఇరు దేశాల క్రికెట్ బోర్టులు విరమించుకున్నాయి.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేస్తూ.. కాల్పుల నుంచి జట్టు సభ్యులందరం క్షేమంగా బయటపడినట్టు చెప్పాడు. ఈ ఘటనతో వణికిపోయామని, తమకోసం ప్రార్థనలు చేస్తుండాలని ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు ముష్పికర్ రహీం ట్వీట్ చేస్తూ.. తమను అల్లానే రక్షించాడని పేర్కొన్నాడు. తాము చాలా అదృష్టవంతులమని, ఇటువంటి ఘటనను మరోమారు చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more